కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆల్‌ ఇండియా సమతావ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో కవితను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాలపై వారిరువురూ చర్చించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్దేశాలు, లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్‌ కుమార్‌ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.

Spread the love