నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత్ ముక్తి మోర్చా వెనుకబడిన, మైనారిటీవర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్) 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్ ఖారత్ ఆహ్వానించారు. బుధవారం ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాదులో కవితను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రమ్ నేతత్వంలో ఈ జాతీయ సదస్సులు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమె అంగీకరించారు.