శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌తో రోడ్ల మ్యాపింగ్‌

– ట్రాక్‌ ‘లో రోడ్ల రికార్డులు : ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్‌ వినోద్‌కుమార్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సిస్టం(ట్రాక్‌)తో మ్యాపింగ్‌ చేయనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ జి శ్రీనివాస్‌రెడ్డి నేతత్వంలో సైంటిస్టులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయా అంశాలపై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్‌, రోడ్లు – భవనాలు, స్టేట్‌ హైవేస్‌, నేషనల్‌ హైవేస్‌ వంటి నాలుగు రకాల రోడ్లు ఉన్నాయనీ, ఈ రోడ్ల పొడవు, వెడల్పు స్థితిగతులను, రోడ్డు మార్గమధ్యంలో కల్వర్టులు, బ్రిడ్జిల అవశ్యకతను శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సిస్టం ద్వారా మ్యాపింగ్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా రాష్ట్రస్థాయిలో డబుల్‌ రోడ్లు, నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయన్నారు.
ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం ఉందని వివరించారు. భవిష్యత్తులో షార్ట్‌కట్‌ రోడ్లు కనెక్టివిటీ సిస్టం కోసం శాటిలైట్‌ మ్యాపింగ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సిస్టం రోడ్‌ మ్యాపింగ్‌ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికకు గైడ్‌గా ఉపయోగపడుతుందని అన్నారు. నిర్ణీత గడువులోగా రోడ్డు శాటిలైట్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ట్రాక్‌ సంస్థ ఏడీజీ శ్రీనివాస్‌రెడ్డితోపాటు అధికారులు రాజోజు నరసింహచారి, మోహన్‌రెడ్డి, బాలకష్ణ, గౌతమ్‌, ప్రకాష్‌, భాస్కర్‌రెడ్డి, అశ్వీన్‌, కమలాకర్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love