10న జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధానిలో ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా నిర్వహించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కవిత ఈ ధర్నా చేపడుతున్నారు. aకవిత మాట్లాడుతూ, దేశంలో బీసీ గణన కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా కవితను ప్రశ్నించింది. అందుకు కవిత బదులిస్తూ… బీజేపీ నాయకులు చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. అరెస్ట్ గురించి ఏ దర్యాప్తు సంస్థ చెప్పాలో ఆ సంస్థే చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని బీజేపీ నేతలు తెలుసుకోవాలి అని కవిత హితవు పలికారు.

Spread the love