నవతెలంగాణ – హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తాజాగా ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ స్కూల్ ప్రిన్సిపల్, సెంటర్ సూపరింటెండెంట్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.