ఎన్నికల కోడ్ ను ఉల్లంగించి106మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్ 

నవతెలంగాణ – సిద్ధిపేట
ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో  బిఆర్ఎస్  రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి,  జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా మెదక్ టిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. విషం తెలుసుకున్న కలెక్టర్ 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
 సెర్ప్ ఉద్యోగులు 38 మంది వారిలో ఏపీఎంలు-14, సీసీలు-18, వివోఏలు-4, సిఓ-1, సిబి ఆడిటర్స్-1, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఏపీవోలు-4, ఈసీలు -7, టిఏలు-38, సిఓలు-18, ఎఫ్ఎ-1 ఉన్నారు.
Spread the love