1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) 796 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 727 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అయితే 5,089 ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య 6,612కు చేరింది. అందుకు సంబంధించిన విధివిధానాలపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Spread the love