నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ ఆయిల్ ట్యాంకర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు ప్రయాణికులతో కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళుతోంది. ఈ క్రమంలో గెరాష్క్ జిల్లాలో జాతీయ రహదారిపైకి రాగానే బస్సును ఓ బైక్ ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఆయిల్ ట్యాంకర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరితో కలిపి మొత్తం 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 38 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు.