తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం..

on-the-third-day-the-assembly-sessions-beganనవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు.
గవర్నర్‌ ప్రసంగంలోని కీలక ఆంశాలు..
ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం.
– తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి ఉంది.
– 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది. మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోంది.
– అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తాం. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నాం.
– ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించాం. హమీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై తొలి సంతకం చేశారు.
– తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన  ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
– బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారంటీలు అమలు చేశాం.
– అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం.. గౌరవభృతి ఇస్తాం.
– వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
– ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.
– అసైన్డ్‌, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ
– కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం.
– ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన.
– వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుకు కార్యాచరణ రూపొందిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
– ప్రజల ఆరోగ్య భద్రత.. మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం.
– త్వరలో మెగా డీఎస్సీ

Spread the love