కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్

నవతెలంగాణ – హైద‌రాబాద్ : మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీకి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఘ‌న‌ స్వాగతం ప‌లికారు. కొత్త ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరాల‌ని కోరుతున్నా. ప్ర‌జాసేవ‌లో విజ‌యం సాధించాల‌ని కొత్త ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.
ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు గవర్నర్‌ అభినందనలు చెప్పారు. రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని తమిళిసై తెలిపారు.

Spread the love