వేసవికి 380 ప్రత్యేక రైళ్లు

నవతెలంగాణ – ఢిల్లీ
వేసవి సీజనులో రద్దీని తట్టుకునేలా 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. దేశంలోని పట్నా, ఢిల్లీ, విశాఖపట్నం, ముంబయి వంటి ప్రధాన కేంద్రాల మీదుగా ఈ రైళ్లను 6,369 ట్రిప్పులు నడపనున్నారు. గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో మొత్తం కలిపి 4,599 ట్రిప్పులను రైల్వేశాఖ నడిపింది. ఈ ఏడాది అంతకంటే 1,770 ట్రిప్పులు అదనంగా నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పట్నా – సికింద్రాబాద్‌, పట్నా – యశ్వంత్‌పుర్‌, విశాఖపట్నం – పూరి – హావ్‌డా తదితర మార్గాల్లో తిరుగుతాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతేడాది కంటే 80 ట్రిప్పులు అదనంగా 784 ట్రిప్పుల మేర ప్రత్యేకరైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

Spread the love