– ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు..
– మే 20న పోలింగ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ మే 20న జరగనుంది. ఈ విడతలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 1,586 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో నామినేషన్ల పరిశీలన తరువాత 749 నామినేషన్లు ఆమోదం పొందాయి. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 695 మంది మిగిలారు. ఉత్తరప్రదేశ్ (14) 144, మహారాష్ట్ర (13) 264, పశ్చిమ బెంగాల్ (7) 88, బీహార్ (5) 80, ఒరిస్సా (5) 40, జార్ఖండ్ (3) 54, జమ్మూకాశ్మీర్ (1) 22, లఢక్ (1) ముగ్గురు పోటీ చేస్తున్నారు.