- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్. బొద్దుల రాజేంద్రప్రసాద్ కి అరుదైన గౌరవం దక్కింది. రాజ్ న్యూస్ చానల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను ప్రతిష్టాత్మకమైన విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..మరింత ఉత్సాహంతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందజేస్తానని ఆయన తెలియజేశారు.
- Advertisement -