నవతెలంగాణ – వనపర్తి : జిల్లాలో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో రూపొందించిన హెల్త్ యాప్ లో టీబీ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్ కు సంబంధించిన రిపోర్టులను అప్లోడ్ చేయాలని ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, వైద్యాధికారులు పరిమళ ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



