Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబేసిక్‌ పోలీసింగ్‌ను మరవొద్దు

బేసిక్‌ పోలీసింగ్‌ను మరవొద్దు

- Advertisement -

– పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
– విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు : హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

విధి నిర్వహణలో బేసిక్‌ పోలీసింగ్‌ను మరవొద్దని, కోర్‌ పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వర్తిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రమూ ఉపేక్షించబోమని హెచ్చరిం చారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సీనియర్‌ పోలీస్‌ అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు-నిర్వహణ, నేరాల నియంత్రణ, దర్యాప్తు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌-టెక్నాలజీ అడాప్షన్‌, మానవ వనరుల నిర్వహణ, తదితర అంశాల ప్రాధాన్యతను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులకు వివరిస్తూ దిశానిర్ధేశం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల భద్రతే ముఖ్యంగా మెరుగైన పోలీసింగ్‌ చేయాలని సూచించారు.

ప్రతి పోలీస్‌ అధికారి 100 శాతం తమ బాధ్యతను నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వహించాలని చెప్పారు. సిబ్బందిని ఒకే పనికి పరిమితం చేయొద్దని, అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వృత్తిని, ఉద్యోగాన్ని ప్రేమిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వివరించారు. తమ పరిధిలో జరిగే విషయాలకు ఎస్‌హెచ్‌వోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో కొన్ని కేసుల్లో నిర్లక్ష్యం వహించినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా కేసులను మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసింగ్‌ జాబ్‌ అనేది అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుందని, వాటన్నింటినీ అధిగమిస్తూ సమర్థ వంతంగా విధులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్లాల న్నారు. అన్ని కేసులను రోటిన్‌గా తీసుకోవద్దని, చిన్న నేరాన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలని సూచించారు. ప్రతి కేసునూ సాంకేతికంగా అన్ని కోణాల్లోనూ విశ్లేషణ చేయాలని సీపీ అన్నారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతికత ఏఐ వినియోగించే అంశాన్ని పరిశీలిస్తు న్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్‌ పోలీసులకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉందని, దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ల డానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్‌) ఎం.శ్రీనివాస్‌, జాయింట్‌ సీపీ(లా అండ్‌ ఆర్డర్‌) తఫ్సీర్‌ ఇక్బాల్‌, జాయింట్‌ సీపీ (అడ్మిన్‌) జె.పరిమళ హానా నూతన్‌, డీసీపీ(డీడీ) ఎన్‌.శ్వేత, డీసీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌) కె.అపూర్వారావుతో పాటు అన్ని జోన్ల డీసీపీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -