- Advertisement -
నవతెలంగాణ కల్వకుర్తి టౌన్
వందేమాతరం గీతం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, సిఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని ముక్తకంఠంతో ఆలపించారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ వందేమాతరం గీతం మనదేశ స్వాతంత్య్ర సమరానికి ప్రేరణగా నిలిచిందని ప్రతి భారతీయుడులో దేశభక్తి జ్వాలలు రగిలించే గీతమిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి సీఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



