– లబ్ధిదారులందరికీ తులం బంగారం ఇవ్వాలి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులపై మంజూరు చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సంతకాలు చేశారు. వేల్పూర్(87), భీంగల్ (104), ఏర్గట్ల(32) మండలాలకు చెందిన మొత్తం 223 దరఖాస్తులపై ఆయన సంతకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు.కొత్తగా చెక్ లు మంజూరయ్యే లబ్దిదారులతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్ లు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.



