- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆత్మీయులను రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. మండల కేంద్రంలో ఇటీవల కాలం చేసిన గౌరాయి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.ఆర్టీసీ డ్రైవర్ శ్యాం ఇటీవల మృతి చెందడంతో వారి సతీమణి విమల ను పరామర్శించి, రూ.5వేల ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. ఫొటో స్టూడియో నీరటి అశోక్ కు ఇటీవల పక్షవాతానికి గురి కావటంతో వారిని పరామర్శించారు. వెంకటాపూర్ గ్రామా ప్రెసిడెంట్ రాజేశ్వర్ తమ్ముడు ఇటీవల ఇజ్రాయిల్ లో గుండె పోటుతో మృతి చెందడంతో వారి కూటింబాన్ని పరామర్శించారు.
- Advertisement -



