- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన బొమ్మిడి రాములు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం సహాయ నిధి కింద రూ.56 వేల విలువగల చెక్కును గురువారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బాదితులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు బండి ప్రవీణ్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుంపల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


