నవతెలంగాణ- హిమచల్ ప్రదేశ్: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ కీలక నిర్ణయం తీసకున్నారు. ఒకే ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకుకు ఇన్సెంటివ్ కింద రూ. 35 వేలు ఇస్తుండగా ఇప్పటీ నుంచి ఆ మొత్తాన్ని రూ. 2లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటిస్తే రూ. 2లక్షలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. హిమాచల్ లో లింగ నిష్పత్తి 1000: 950 గా ఉంది. దేశంలోనే అత్యుత్తమ స్థానంలో మూడో స్థానంలో ఉంది.