- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని ఆయా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో శుక్రవారం చాచా నెహ్రూ జయంతి పురస్కరించుకొని బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిధిలోని కొట్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మణ్ , పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



