కెటిపిపి ఇంజనీర్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు, భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని భూ నిర్వాసితులు తాండ్ర మల్లేష్,స్వరూప రాణి బుధవారం భూపాలపల్లి జిల్లా సెల్పూర్ కెటిపిపి చీఫ్ ఇంజనిర్ కు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డేంజర్ జోన్లో నివసిస్తున్న నిర్వాసితుల ఇండ్లను సేకరించి పరిహారం, ప్యాకేజి అందజేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ జెన్కో సిఎండి పాత నంబర్ల ప్రకారం 1080 ఇండ్లను 30 శాతం పరిహారం పెంచుతూ 1500 ఇండ్లకు త్వరగా నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు. ఇందుకు ఎస్ఈ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.
డేంజర్ జోన్లోన్న ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



