- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల కమిటీ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేసారు. అనంతరం సమావేశమై డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీంగల్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీంగల్ మండల శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా జాన్ విల్సన్, ప్రధాన కార్యదర్శిగా గట్టు ఈశ్వర్, ఉపాధ్యక్షులుగా సంగీత, కార్యదర్శి రమేష్, కోశాధికారి శ్రావణ్ కుమార్ లు ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు ఎం.బాలయ్య తెలిపారు.
- Advertisement -



