కలెక్టర్ కార్యాలయంలో ఏఓ కు టిడబ్ల్యూజెఎఫ్ వినతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని పరిపాలన అధికారి మోతిలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాలుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోగా దానిని రెన్యువల్ చేసుకుంటూ పోతున్నారని చెప్పారు. ఈ మూడేళ్ల కాలంలో అనేక మంది జర్నలిస్టులు చేర్పులు మార్పులు జరిగాయని దాని వలన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వం తక్షణమే కొత్త అక్రిడేషన్ కార్డు జారీ చేసే విధంగా విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా అక్రిడేషన్ కమిటీలను నియమించాలన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మండలాల వారిగా పని చేసే జర్నలిస్టులకు మండల కేంద్రాలలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు ప్రైవేట్, కార్పొరేటర్ ఆసుపత్రిలో చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని జర్నలిస్టు లకు హెల్త్ కార్డులు అన్ని ప్రవైట్, కార్పోరేట్ ఆసుపత్రులలో చెలుబాట అయ్యే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50% ఫీజు రైతు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా జర్నలిస్టులకు విధులు ముగించుకుని రాత్రి వేళలో ఇంటికి వెళ్లే సమయంలో రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు త్వరత గతంగా పూర్తి అయ్యేలా చూడాలని కోరగా ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిస్తానని ఏవో మోతిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర నాయకులు సాదత్ అలీ, వరుణ, జిల్లా నాయకులు పుష్ప లత, ఖాజా నాజీముద్దీన్, నరేందర్ రెడ్డి, నాగయ్య, రామకృష్ణ, బాలరాజు, సైదులు, హరికృష్ణ, జర్నలిస్టులు పాల్గొన్నారు.



