- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజుల జెండాను ఎగరవేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయంగా ముదిరాజులు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



