- Advertisement -
నవతెలంగాణ – రామగిరి : సింగరేణి ఆర్ జి-3 ఏరియాలోని ఓసిపి- 2కు, నూతన ప్రాజెక్ట్ అధికారిగా పదవి బాధ్యత స్వీకరించిన జంగేటి రాజశేఖర్ ను ఓసిపి- టు మైనింగ్ స్టాప్ టర్కీ టవల్, పూల మొక్కతో ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రాజెక్ట్ అధికారి రక్షణతో కూడుకున్న ఉత్పత్తి సాధించడంలో మైనింగ్ సూపర్వైజర్ల పాత్ర కీలకమని యంత్రాలు పూర్తి పనిగంటలు పనిచేయడంలో దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ ఆవుల సంపత్ కుమార్, మైనింగ్ స్టాప్ బత్తుల రమేష్, పెద్దపల్లి రామచందర్, కనకం రాజ్ కుమార్, మహేష్, వెంకటేశం, శ్రీనివాస్, కుమారస్వామి, సత్యనారాయణ, ఆదాం, వంశి, తాహెరూ,కొమ్ము రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



