నవతెలంగాణ – కంఠేశ్వర్
అన్సంగ్ గురు అవార్డు అందుకున్న నాగరాజు నిజామాబాద్ సిపి సాయి చైతన్య ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. భారత ఫుట్బాల్లో గ్రాస్రూట్ స్థాయిలో యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో చూపిన విశేష సేవలకు గుర్తింపుగా, ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ కోచెస్ ఇన్ ఇండియా (ఎఫ్ ఎఫ్ సి ఐ) నుండి అన్సన్ గురు అవార్డు అందుకున్న కోచ్ నాగరాజు, ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించిన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నాగరాజు అవార్డు పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందనలు తెలియజేశారు. ఫుట్బాల్ అభివృద్ధి, గ్రామీణ ప్రతిభను వెలికితీయడం, కోచ్ల పాత్ర, యువతను క్రీడల వైపు దారి చూపడం వంటి అంశాలపై ఇద్దరూ చర్చించారు.అవార్డు పొందిన ఆనందాన్ని వ్యక్తం చేసిన నాగరాజు, భారత ఫుట్బాల్ అభివృద్ధి కోసం మరింత సేవ చేయాలనే సంకల్పాన్ని తెలియజేశారు.
అన్సంగ్ గురు అవార్డు అందుకున్న నాగరాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



