- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడదుల కానుంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వగా.. పంచాయతీరాజ్శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. సాయంత్రం 6గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు.
- Advertisement -



