మండలంలోని సోమవారం నాడు పోలీసులు వివిధ గ్రామాలలో బెల్టు షాపులపై దాడులు నిర్వహించగా మండలంలోని బేగంపూర్ గ్రామంలో స్థానిక ఏఎస్ ఐ రాములు దాడులు నిర్వహించారు. బెల్టు షాపుల్లో లీటర్ల 3.9 బీర్లు, లీటర్ల8.4లేకర్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెల్ట్ షాప్ ల పై కఠిన చర్యలు తప్పదని మద్యం షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు చేపడితే ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు బెల్టు షాపులపై దాడులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి బెల్ట్ షాపుల్లో మద్యం దొరుకితే చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన బెల్ట్ షాప్ నిర్వాహకులకు హెచ్చరించారు.