Wednesday, December 3, 2025
E-PAPER
Homeకరీంనగర్65 సెల్ ఫోన్ ల ఆచూకీ లభ్యం: ఎస్పీ

65 సెల్ ఫోన్ ల ఆచూకీ లభ్యం: ఎస్పీ

- Advertisement -

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో ఇప్పటి వరకు 2183 ఫోన్లను గుర్తించి బాధితులకి అందించాం5
జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ 83 శాతం: జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోరీకి గురైన 60 లక్షలు విలువగల 65 సెల్ ఫోన్లను పట్టుకోవడం జరిగిందని ఇప్పటివరకు 2183 సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన , చోరీకి గురైన సుమారు 60 లక్షల విలువ గల 65 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పి మహేష్ బి. గీతే  పేర్కొన్నారు.  ప్రస్తుత రోజుల్లో.మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని, మన విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి,వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే,గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు.

మొబైల్  ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అ షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని  అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 2183 ఫోన్లు గుర్తించి సబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందించడం జరిగింది.సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 83 % రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ ,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించరు. పోయిన మొబైల్ ఫోను మళ్లీ దొరకదనుకున్న మొబైల్  ఫోన్ జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఐ యాదగిరి,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -