Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడోదశ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మూడోదశ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

- Advertisement -

మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శన
నవతెలంగాణ – వనపర్తి

ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని,  ప్రజలు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం సందర్శించారు. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడవ విడత ఎన్నికలు నిర్వహించనున్న 5 మండలాల్లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో సజావుగా నిర్వహిస్తామన్నారు.

ప్రజలు తమ అమూల్యమైన ఓటును తమకు నచ్చిన అభ్యర్థికి వేసుకోవాలని సూచించారు. పెబ్బేరు, చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలల్లో ఎలాంంటి పొరపాట్లకు తావివ్వకూడదని డిస్ట్రిబ్యూషన్ అధికారులను ఆదేశించారు. మూడవ విడతలో పెబ్బేరు మండలంలో  17 సర్పంచి, 141 వార్డు మెంబర్లు, చిన్నంబావి మండలంలో 16 సర్పంచి, 139 వార్డు మెంబర్లు, వీపనగండ్ల మండలంలో 14 సర్పంచి, 124 వార్డు మెంబర్లు, శ్రీరంగాపూర్ మండలంలో 8 సర్పంచి, 77 వార్డు మెంబర్లు , పానగల్ మండలంలో 26 సర్పంచి, 221 వార్డు మెంబర్లు వెరసి 81 గ్రామ సర్పంచి, 702 వార్డు మెంబర్లకు బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగే పోలింగ్ లో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు.

   ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీస్ భద్రత కల్పించడం జరిగిందని, ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర నిఘా పెడుతూ ఎక్కడైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా లేదా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన లేదా భయబ్రాంతులకు గురి చేసిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల అథారిటీ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.

తుది విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 968 ప్రిసైడింగ్ అధికారులు, 1271 ఒ .పి.ఓ లు వెరసి 2239 మంది పోలింగ్ సిబ్బంది మంగళవారం మెటీరియల్ తీసుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు పెబ్బేర్ మండలంలో, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ వీపనగండ్ల మండలంలో, ఆర్డీఓ సుబ్రమణ్యం చిన్నంబావి మండలంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పర్యవేక్షించారు. తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -