- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో చివరి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రానికి సర్పంచ్ ఫలితాలు తేలనున్నాయి. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచులను ఎన్నుకుంటారు. ఈ విడతలో 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 28,410 వార్డులకు 75,725 మంది బరిలో ఉన్నారు.
- Advertisement -



