- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్, ఉప సర్పంచ్ కవిత విట్టల్ రావు పటేల్, ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్ జయశ్రీకి, ఉపసర్పంచ్ కవితకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యాదవ రావు పాటిల్, గ్రామ పెద్దలు దిగంబరావ్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



