Saturday, December 27, 2025
E-PAPER
Homeజిల్లాలుపెన్షనర్స్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

పెన్షనర్స్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 29, 30 తేదీలలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే.రామ్మోహన్రావు, అధ్యక్షుడు శిల్పహనుమాన్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు ప్రసాదరావు, లావు వీరయ్య ,రాధా కిషన్, అమీదద్దీన్, రాజేశ్వర్, చంద్రశేఖర్ , సిరప్ప లింగయ్య, బాలయ్య, శేఖర్, సాగర్, మధుసూదన్, తదితరులు పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మహాసభలలో వివిధ రంగాల పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని వారు తెలిపారు. ఈ మహాసభలకు పెన్షనర్ యూనియన్ల జాతీయ నాయకులు హాజరవుతారని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -