‘ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని, కెరీర్ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్గా నిలిచిన హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఈ సందర్బంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.
బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేం దుకు కారణంగా నిలిచిన బిగ్బాస్కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని అన్నారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని, ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని చెప్పారు. ప్రభాస్ ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘విజనరీ వౌస్’కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గెలుపు నాది కాదు
- Advertisement -
- Advertisement -



