రత్తి రామ్ తండా గ్రామ ఉపసర్పంచ్ సంతోష్ నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఒక వరం లాంటిదని రత్తిరామ్ తండా గ్రామ ఉపసర్పంచ్ సంతోష్ నాయక్ అన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారురాలకి మంజూరైన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కును డిసిసి ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ చేతుల మీదుగా అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1 లక్షా 116 ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం చెక్కు అందుకున్న కుటుంబం ప్రభుత్వానకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సురేష్ నాయక్, అశోక్ నాయక్, ఏం సి డైరెక్ట్ భాస్కర్, వార్డ్ మెంబర్ కిషన్, శంకర్, వెంకన్న, మోహన్, రాజన, పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



