Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రాన్స్ జెండర్స్ కి ఆర్థిక పునరావాస పథకం కు దరఖాస్తుల ఆహ్వానం

ట్రాన్స్ జెండర్స్ కి ఆర్థిక పునరావాస పథకం కు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ కి ఆర్థిక పునరావాస పథకం కింద రూపాయలు 75,000/- చొప్పున మొత్తం 1 యూనిట్ కు 75,000/- రూపాయలు 100% సబ్సిడీ మీద జిల్లా కి కేటాయించడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్స్ అర్హులైన వారు తెలిపిన ద్రువపత్రాలతో తేదీ 05-01-2026 లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సదరు ట్రాన్స్ జెండర్ వ్యక్తికి సంబంధిత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన గుర్తింపు పత్రం మరియు గుర్తింపు కార్డు ఉండాలి. వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2.00 లక్షలకు మించకూడదు.

 అభ్యర్థులు గత (5) సంవత్సరాలలో వికలాంగుల సంక్షేమ శాఖ నుండి గానీ, ఇతర శాఖ నుండి గానీ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి గానీ సబ్సిడీని పొంది ఉండకూడదు. ఒక కుటుంబానికి (5) సంవత్సరాలలో కేవలం ఒక స్వయం ఉపాధి పథకానికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.  ఈ పథకాన్ని పొందిన లబ్ధిదారులు తదుపరి (5) సంవత్సరాల వరకు అటువంటి పథకం కింద ఏ ప్రయోజనానికి అర్హులు కారు.  సాంకేతిక అర్హతలు ఉన్న , సంబంధిత కార్యకలాపంలో గణనీయమైన అనుభవం ఉన్న అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏదైనా యూనిట్ కోసం శిక్షణ పొందిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందనారు. విద్యార్హత పత్రములు ఏవైనా  (02) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -