నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ శాఖలో డిసెంబర్ 31న నలుగురు పదవి విరమణ చేశారు. పదవి విరమణ చేసిన సిబ్బంది వివరాలు 43 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని చందర్ రాథోడ్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా పదవి విరమణ పొందారు. సిహెచ్ ముక్తేశ్వరరావు 35 సంవత్సరాల సర్వీస్ను పూర్తిచేసుకుని నిజామాబాద్ ఏ ఆర్ ఎస్ ఐ పదవి విరమణ చేశారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పీ సంజీవ్ హెడ్ కానిస్టేబుల్ గా 36 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకుని పదవి విరమణ చేశారు. మూడవ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ శివకుమార్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు.
వీరి పదవి విరమణ స్వచ్ఛంద పదవీ విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.ఈ వీడ్కోళ్లుసందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీ.సీ.పీ (ఏ.ఆర్) కే. రామచంద్రరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , తిరుపతి, పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



