నవతెలంగాణ – హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 11న స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రీమియర్ షోతో పాటు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధర రూ.50 పెంపు, మల్టీప్లెక్స్ లలో రూ.100 మేరకు పెంచుకోవచ్చని సూచించింది. పెంచిన రేట్లను వారం రోజుల పాటు వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


