- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో సోమవారం ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని హెచ్చరించింది.
- Advertisement -


