- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గ్యాస్ నింపుతుండగా కారు ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో కారు పక్కన పార్క్ చేసిన మరో రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -



