– జిల్లా నాయకులు దొడ్డా లక్ష్మి నారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా సమస్యలు పరిష్కారానికి సీపీఐ (ఎం) దిక్సూచి లాంటిది అని, పార్లమెంట్,అసెంబ్లీ, స్థానిక సంస్థల లో ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే వామపక్ష ప్రతినిధులు గెలవడం ఆవస్యకం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మి నారాయణ అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ ( ఎం) 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తగరం నిర్మల విజయం కాంక్షిస్తూ సోమవారం అశ్వ రావు పేట మున్సిపాలిటీ 21 వ వార్డు పరిధిలో ఉన్న నెహ్రూ నగర్,పేరాయిగూడెం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి, అశ్వారావుపేట, దమ్మపేట మండల కార్యదర్శులు సోడెం ప్రసాదు,మోరంపుడి శ్రీనివాస్ రావు, స్థానిక మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మంగళగిరి గంగరాజు, మహిళా నాయకురాలు కొక్కెరపాటి కృష్ణవేణి లు పాల్గొన్నారు.



