- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్ : బైకుపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో 167 జాతీయ రహదారిపై వ్యక్తికి తీవ్ర గయాలైన సంఘటన శనివారం జరిగింది. మండలంలోని మున్ననూరు గ్రామానికి చెందిన జంగయ్య ద్విచక్ర వాహనంపై మిడ్జిల్ నుండి ముచ్చర్లపల్లి గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో గాయపడ్డాడు. స్థానికుల 108కు సమాచారాన్ని అందించడంతో సంఘటన స్థలానికి వాహన సిబ్బంది షకీల్, శివ ప్రధమ చికిత్స జరిపి అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -


