- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుని, వారికి నివాళులు అర్పించారు. దశాబ్దాల అణచివేతపై పోరాడి, ప్రజాస్వామ్య పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన తెలంగాణను స్వయం పాలనలో దిక్సూచిగా మార్చి, ‘పరిపాలన చేతగాదు’ అన్న విమర్శలను తిప్పికొట్టి ప్రగతి పాలన అందించామని కేసీఆర్ గుర్తు చేశారు.
- Advertisement -



