- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ ఇటలీ తీర ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.1 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి సుమారు 253 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక నివేదికలు లేవు. భూకంప కేంద్రం లోతుగా ఉండటం వల్ల ఉపరితలంపై ప్రభావం పరిమితంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -



