- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరుల స్తూపం దగ్గర పుష్ఫ గుచ్చంతో నివాళి అర్పించారు. సీఎంతో పాటు పలువురు నేతలు నివాళి అర్పించారు.
- Advertisement -


