- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు, జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



