- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉప్పల్ భగాయత్ వేదికగా జులై 2న మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం చేయనున్నట్టు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆగస్టు 6లోగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అమరవీరుని కుటుంబానికి రూ.ఒక కోటి ఆర్థిక సాయమందిస్తామని కవిత హామీ ఇచ్చారు.
- Advertisement -



