- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేటలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఎస్ ఎస్ కే కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యురాలు స్నేహ మాట్లాడుతూ… ఎయిడ్స్, హెచ్బియస్ ఏజి, హెచ్ సి వి, ఆర్ బి ఎస్, ఎంపీ, చాతి ఎక్స్రే పై అవగాహన కల్పించారు.164 మందికి రక్త పరీక్షలు, 70 మందికి ఎక్స్రేలు, నిర్వహించి రిపోర్టు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సర్పంచ్ నాగులపల్లి రాజేందర్, అన్నారం, రామారెడ్డి పిహెచ్సి వైద్యులు వేణుమాధవ్, సురేష్, ఎయిడ్స్ నియంత్రణ మండలి డిపిఎం సురేందర్ రెడ్డి, పిఎస్ ఓ నవీన్ కుమార్, ఎన్ ఎ సి పి కౌన్సిలర్ నాగరాజు, శేఖర్, మెహరాజ్, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



