Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మస్తు బందోబస్తు..క్షణ క్షణం ఉత్కంఠం 

మస్తు బందోబస్తు..క్షణ క్షణం ఉత్కంఠం 

- Advertisement -

నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 
చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.పోలీసులు మస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 మందితో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు తమ కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఇబ్రహీంపట్నం ఏసీబీ కేపీవి రాజు హెచ్చరిక జారీ చేశారు. మనము చట్టం పక్షం తప్ప ఎవరి పక్షం కాదని గుర్తు చేశారు ఏ రాజకీయ పక్షానికి ఫోన్ల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సమాచారం ఇస్తే చర్యలు తప్పమని హెచ్చరించారు ఇప్పటికే 12 మంది తమ దృష్టిలో ఉన్నారని గుర్తు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పాలకవర్గ సభ్యులు హాజరు కావాల్సి ఉంది. అందుకు ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కే అనంతరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు సిద్ధం చేశారు. సమావేశ మందిరాన్ని సైతం ఎన్నికకు అనుగుణంగా సిద్ధం చేసి ఉంచారు. 

బీఆర్ఎస్ ఏఫామ్, బీఫామ్ సమర్పణం..
మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎన్నికకు సంసిద్ధంగా ఏర్పాటు సిద్ధం చేసుకుంది అందుకు అనుకూలంగా ఉదయం 9 గంటల సమయంలో ఆ పార్టీ రాసి నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం చేరుకొని తమ ఫ్యానాల్ తరఫున ఏ పాము బి ఫామును ఎన్నికల అధికారులకు సమర్పించారు. అదేవిధంగా ఉదయం 10గంటల 15 గంటలకు కాంగ్రెసు తరపున ఆ పార్టీ కౌన్సిలర్లు నీలం బాను బాబు, దారు రాఘవేందర్రావు ఎన్నికల అధికారులకు ఏ ఫామ్, బీఫామ్ సమర్పించారు. 10.17 గంటలకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు సమావేశ మందిరంలోకి చేరుకున్నారు. వీరి వెంట 18 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ కూడా ఉన్నారు. 

రెండు మిస్సింగ్ కేసులు..
ఇబ్రహీం మన మున్సిపల్ కౌన్సిలర్లు తప్పిపోయారని వారి వారి కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం మూడో వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయ సాధించిన దాసరి మురళి కృష్ణ తప్పిపోయినట్లుగా  మురళీకృష్ణ తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇబ్రహీంపట్నం 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తప్పిపోయినట్లుగా ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులు తాత్కాలికంగా పెండింగ్లో ఉన్నాయి. 

ఇరు వర్గాల జన సమీకరణ..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు జన సమీకరణకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు) కార్యాలయం జన సందోహంతో నిండిపోయింది. భారీ స్థాయిలో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగయ్యారు. 

బీఆర్ఎస్ సైతం.. 
కాంగ్రెస్ పార్టీ జన సమీకరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తామేమి తక్కువ కాదన్నట్లుగా బిఆర్ఎస్ పార్టీ సైతం పార్టీ కార్యకర్తలను సమీకరణకు పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయానికి తరలి రావాలని సూచించింది దాంతో ఒక్కొక్కరు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వెలిమినేడు ఫామ్ హౌస్ లో కార్యకర్తలు పోగాచినట్లు సమాచారం. అదేవిధంగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కుక్కగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు మైసూర్ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎసీపీ కేపీవీ రాజు పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పోలీసులు ఇబ్రహీంపట్నం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నలుగురుకు మించి యువకులని గుమ్మి కూడడానికి అవకాశం ఇవ్వడం లేదు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -